సిరాన్యూస్, రాజన్నసిరిసిల్ల
చౌడాలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన చల్మడ లక్ష్మీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామంలో శుక్రవారం చౌడలమ్మ జాతర నిర్వహించారు. ఈ జాతరకు వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి చల్మడ లక్ష్మీ నరసింహ రావు హాజరయ్యారు. ఈసందర్భంగా చల్మడ లక్ష్మీ నరసింహ రావు ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, ఎంపీటీసీ లింగంపల్లి లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య , వైస్ చైర్మన్ భూంరెడ్డి , గ్రామ శాఖ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మల్లారెడ్డి, మండలం యూత్ అధ్యక్షులు జీవన్ గౌడ్, రమేష్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.