సిరా న్యూస్, ఉట్నూర్
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం :ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కాంగ్రెస్లో చేరిన వడోని గ్రామ యువకులు
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎమ్మెల్యే నివాసంలో వడోని గ్రామానికి చెందిన యువకులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికీ కండువా కప్పి పార్టీలో సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 ఏళ్ళ బీజేపీ, బిఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద 200యూనిట్ల ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ పథకం కింద 10 లక్షల భీమా,లాంటి ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. పేదల బ్రతుకులు మారాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశంలో సూ పరిపాలన అందిస్తారన్నారు.రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.