సిరా న్యూస్, జైనథ్
నరేంద్ర మోడీని ప్రధానిని చేద్దాం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
* బీజేపీలో చేరిన గూడ గ్రామ యువకులు
మరోసారి నరేంద్రమోడీని ప్రధానిని చేద్దామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గూడా గ్రామంలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి నరేంద్ర మోడీ పాలన తీరును, ఆయన సాధించిన విజయాలను, ప్రజల కోసం చేసిన మంచిని ఆయన వివరించారు. కరోనాకాలంలో ఈ విధంగా నరేంద్ర మోడీ నిర్ణయాలు తీసుకొని దేశాన్ని పెద్ద విపత్తు నుండి బయటకు తీసుకువచ్చారని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ఆదిలాబాద్ కు ఆరువేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం ఆ పనులు ప్రారంభం ప్రారంభమవుతాయని తెలిపారు. తరణం బ్రిడ్జి కోసం కూడా కేంద్రం నిధులు మంజూరు చేసిందని అన్నారు. ఈ సందర్భంగా గూడ గ్రామం యువకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. మాజీ సర్పంచ్ బేత రమేష్, సింగిల్ విండో ఛైర్మెన్ భగవంత్ రావు ఆధ్వర్యంలో బీజేపీలో యువకులు చేరారు. కార్యక్రమంలో నాయకులు రాందాస్, బోయారు విజయ్, చిలుకూరి జ్యోతి రెడ్డి, అశోక్ రెడ్డి, రఘుపతి, దేవన్న, ప్రతాప్, రమేష్, రాజు , కార్యకర్తలు పాల్గొన్నారు