సిరాన్యూస్, ఓదెల
చెరువు పూడికతీత పనులు ప్రారంభం
ఓదెల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం దగ్గర ఉన్న బై శెట్టి కుంటలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలతో చెరువు పూడికతీత పనులను ప్రారంభించారు.రోజువారి పనిలో భాగంగా ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఉపాధి కూలీలతో చెరువులను పూడికతీతను చేయిస్తున్నారు. రానున్న వర్షాకాలం నాటికి చెరువులన్నీ నీటి తో నిండి పోవాలని, పూడిక తీత మొదలు పెట్టారు. చెరువులను నీటితో నిండిన తర్వాత రైతులు తమ పంట పొలాలకు ఉపయోగించు కుంటారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది. చెరువులన్నీ నీటితో నిండిన తర్వాత రైతులు పండించే పంటకు సమృద్ధిగా నీరు అందుతుంది.