సిరా న్యూస్,ఎమ్మిగనూరు;
పట్టణంలోని 21 వ వార్డ్ లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకమ్మ ఆదేశాల మేరకు 21 వార్డు ఇంచార్జ్ తార రాజశేఖర్ మరియు వార్డ్ కన్వీనర్ సయ్యద్ చాంద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరిస్తూ ప్రతి అక్క చెల్లెమ్మలకు అన్నగా, చేనేతలకు తోడుగా నిలుస్తూ మనల్ని ప్రగతి బాటలో నిలిపే ఏకైక వ్యక్తి జగనన్న మాత్రమే అని అన్నారు. రానున్న రోజుల్లో మన ప్రభుత్వంలో జరిగే అభివృద్ధిని వివరించారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన ఎమ్మెల్యేగా బుట్టా రేణుకమ్మ గారిని 50వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు మరియు ఎంపీగా బీవై రామయ్య గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని,ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వేయించాలని అభ్యర్థించారు
*ఈ ప్రచారంలో నాయకులు కన్వీనర్ శివ కో కన్వీనర్ రాజేష్ విజయ్ శంకర్ యూత్ నాయకులు ఇలాహి ,ఈ ప్రచారంలో సచివాలయం కన్వీనర్లు మరియు గృహ సారధులు తాహెర్ యూనిస్ నరేష్ తదితరులు పాల్గొన్నారు