సిరాన్యూస్, బేల
ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలి : సామ రూపేష్ రెడ్డి
టాక్లిలో ఉపాధి హామీ పనుల వద్ద కాంగ్రెస్ నాయకుల ప్రచారం
కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని యూత్ నాయకులు సామ రూపేష్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో బేల మండలంలోని టాక్లి గ్రామంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కకు మద్దతుగా సామా రూపేష్ రెడ్డి మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారెంటీ కార్డును వారికి అందజేశారు. గ్రామం లో వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందని ఇంటింట ప్రచారం చేశారు.ఈ ప్రచారం లో మాజీ సర్పంచ్ సుదాం రెడ్డి, ఎంపిటిసి నగేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ బాపురావు, వినోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కన్య రాజు, హైమద్, దీపక్ ప్రభాకర్, కిష్టన్న, విశాల్, సతీష్, తదితరులు ఉన్నారు.