బీ ఫార్మసీ విద్యార్ధిని అత్మహత్యాయత్నం

 సిరా న్యూస్,కరీంనగర్;
కరీంనగర్ జిల్లాలో బీ ఫార్మసి విద్యార్ధిని శివప్రియ ఆత్మహత్యకు యత్నించింది. హాస్టల్ భవనం పై నుంచి దూకడంతో తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ గ్రామపంచాయితీ పరిధిలోని సుభాష్ నగర్ లో వాగేశ్వరి కళాశాలలో బీ ఫార్మసీ చదువుతున్న శివప్రియ అక్కడ ప్రైవేట్ హాస్టల్ లక్ష్మిత లో ఉంటున్నారు. ఉదయం హాస్టల్ భవనం మూడంతస్తులపై నుంచి శివప్రియ దూకి ఆత్మహత్యకు యత్నించింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే కారులో ఆసుపత్రికి తరలించారు. శివప్రియ స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గా గుర్తించారు. శివప్రియకు తలకు తీవ్రగాయంకాగ బ్లడ్ క్లాట్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఓ కాలు సైతం ప్యాక్షర్ అయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏమి చెప్పలేమని వైద్యులు తెలిపారు.

హస్టల్ భవనం పై నుంచి దూకి బీ ఫార్మసి విద్యార్ధిని శివప్రియ ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికి ప్రేమవ్యవహారమే అందుకు కారణమని భావిస్తున్నారు. స్థానికులు తోటి విద్యార్ధులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తల్లితో పోన్ లో గొడవపడినట్లు తోటి విద్యార్ధులు తెలిపారు. పోలీసులు ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. పేరెంట్స్ వస్తే గాని అసలు విషయం తెలియదని అంటున్నారు.

రామకృష్ణకాలనీ శివారులోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా ఫస్టియర్ విద్యార్థి అభిలాష్ కళాశాల హాస్టల్ నుంచి అదృశ్యమైన నెలరోజుల తర్వాత వ్యవసాయ బావిలో శవమై తేలాడు. తల మొండెం వేరై బావిలో లభించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేరెంట్స్ మాత్రం హత్యేనని పోలీసులకు పిర్యాదు చేశారు. కళాశాల యాజమాన్యం మాత్రం ఆత్మహత్య అని చెప్పుకొస్తుంది. పోలీసుల మాత్రం అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి మిస్టరీని చేదించే పనిలో నిమగ్నమయ్యారు. సంఘటన జరిగి రెండు మాసాలు అవుతున్నా..హత్యనా?.. ఆత్మహత్యానా ఇంకా తెలకపోవడం సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా అదే ప్రాంతంలోని మరో కళాశాల బీ పార్మసి విద్యార్ధిని శివప్రియ ఆత్మహత్యయత్నం కలకలం సృష్టిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *