సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించండి : కౌన్సిలర్ ఆఫ్రికా బేగం అమానుల్లా ఖాన్
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కౌన్సిలర్ ఆఫ్రికా బేగం అమానుల్లా ఖాన్ అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో 6వ వార్డులో కార్యకర్తలు,నాయకులతో కలిసి స్థానిక కౌన్సిలర్ ఆఫ్రికా బేగం అమానుల్లా ఖాన్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా సుగుణక్కకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ తోట సత్యం, మాజీ జెడ్పి కోఆప్షన్ సభ్యులు యూసుఫ్ ఖాన్, మాజీ సర్పంచ్ నేరెళ్ల సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ గంగాధర్, రాజేందర్, మాజీ వార్డు సభ్యులు హైమద్, ముషిర్, సల్ల బుజ్జి,జియా,అర్ఫత్ ఖాన్, మోహిన్, తదితరులు పాల్గొన్నారు.