Rajireddy: వెలిచాల రాజేందర్‌రావును అధిక మెజార్టీతో గెలిపించాలి

సిరాన్యూస్‌, సైదాపూర్:
వెలిచాల రాజేందర్‌రావును అధిక మెజార్టీతో గెలిపించాలి
* వెన్నంపల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాజిరెడ్డి

కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని వెన్నంపల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ రాజిరెడ్డి అన్నారు. శ‌నివారం సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న పలు షాపుల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును అధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 ఖచ్చితమైన గ్యారంటీలు చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వెన్నంపల్లి పిఎసిఎస్ మాజీ చైర్మన్ రాజిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు మారపాక తిరుపతి, మాజీ ఎంపీటీసీ పరకాల రమేష్, కంది తిరుపతి రెడ్డి, మొలుగూరి కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *