ఎన్నికల విధులకు జంకుతున్న అధికారులు…
ఓవైపు ఎన్నడూ లేనంతగా ఎండలు
కరీంనగర్సిరా న్యూస్;
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉండడంతో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు డ్యూటీ కత్తి మీద సాములా మారింది..
ఎన్నికల విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన హెడ్మాస్టర్ తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో జరిగింది… …మండల విద్యాధికారిగా పనిచేస్తున్న బత్తుల భూమన్న ఎన్నికల విధుల్లో భాగంగా రాజారాం పల్లి గ్రామంలో రోజంతా గడిపారు తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కళ్ళు తిరగడంతోపాటు వాంతులు కావడంతో డిహైడ్రేషన్ కి గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు గత 28 సంవత్సరాలుగా విద్యారంగంలో విశేషంగా కృషి చేసిన భూమన్న అకాల మృతితో అధికారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో అనేక ప్రభుత్వ టీచర్ల కుటుంబాలకు భూమన్న ప్రత్యేకంగా చొరవ తీసుకొని సహాయం అందించారు . ఒక మంచి అధికారిని కోల్పోయామని పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.