సిరా న్యూస్,రంగారెడ్డి;
కూకట్ పల్లి సాయిబాబా నగర్ లోని పోస్ట్ గ్రాఫ్ దుకాణంలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. స్క్రాప్ దుకాణంలో అనుమతి లేకుండా చిన్న సిలిండర్లను నిల్వ చేయడంతో అందులోని ఓ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న స్క్రాప్ కు అంటుకొని మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అధికారులు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అనుమతులకు విరుద్దంగా చిన్న సిలిండర్లను నిల్వ ఉంచడంతోనే ప్రమాదం జరిగిందని స్తానికులు తెలిపారు.
=====