సినీ హీరో నారా రోహిత్
సిరా న్యూస్,ఎచ్చెర్ల;
రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తు అని సినిమా హీరో నారా రోహిత్ అన్నారు. విజయనగరం ఎచ్చర్ల నియోజకవర్గం లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడారు.. అవినీతి, అరాచకాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు రావాలని కోరారు. ఎన్నికలు మరో పది రోజులు మాత్రమే ఉన్నాయి.. కూటమి కూటమి అభ్యర్థులు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి ఈశ్వరరావు గెలుపు గెలుపు కోసం అందరూ సమిష్టి కృషి చేయాలని భావించారు. రాష్ట్రంలో ఒక్క రైతుకైనా న్యాయం జరిగిందా.. ఒక్క ప్రాజెక్ట్ అయిన పూర్తి చేశారా అని వైసిపి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రశ్నించిన వారిని అంతం చేయడమే వైసీపీ అభివృద్ధి అని ఎద్దేవ చేశారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే బాబు గారు మళ్ళీ రావాలని పిలుపునిచ్చారు.. అనంతరం విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఒక సాధారణ కార్యకర్తకు చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇచ్చారు. తన మీద నమ్మకముంచి తనను ఎంపి అభ్యర్థిగా నిలబెట్టారు. చంద్రబాబు నమ్మకాన్ని తప్పక నిలబెడతాను. ఈ ఎన్నికల్లో అత్యంత మెజార్టీతో గెలుపొంది చంద్రబాబు నాయుడికి కానుకగా ఇస్తానని అన్నారు.
========================