రాక్షసులు ఎన్ని కుట్రలు చేసిన గెలిచేది ధర్మమే

-కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి

సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులను ఓడించేందుకు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది ధర్మమమేనని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు తాడేపల్లిగూడెం మండలం తాళ్లపాలెం, ఉప్పరగూడెం, దండ గర్ర, లింగారాయుడు గూడెం, అమృతపురం, ఇటుకుల గుంట, మెట్ట ఉప్పరగూడెం గ్రామాల్లో శుక్రవారం రాత్రి టిడిపి జిల్లా అధ్యక్షుడు రామరాజు, నియోజకవర్గ టీడిపి అధ్యక్షుడు వలవల బాబ్జి, బిజేపి అధ్యక్షుడు ఈతకోట తాతాజీ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ తనను ఓడించేందుకు అవినీతి నేత కుట్రలు పన్నుతున్నారని, పార్టీని పోలిన పార్టీని, బొలిశెట్టి శ్రీనివాస్ ను పోలిన మరో పేరును బరిలో నిలిపారని ఈ కుట్రలన్నింటిని ప్రజలే కుట్రతో తిప్పి కొడతారన్నారు. అదికారంలో ఉన్నంత సేపు ప్రజా శ్రేయస్సు మరిచి అవినీతికి ప్రాధాన్యం ఇచ్చిన రాజకీయ రౌడీని ప్రజలు తరిమి కొడతారన్నారు. జగన్ అరాచకాలకు అంతం పలికే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రాబోయేది కూటమి ప్రభుత్వమే అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు.
=============================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *