వాల్మీకి రామాయణంలో శబరి పాత్ర గొప్పది…
నంద్యాల టీడీపీ ఎం.పీ. అభ్యర్థి డాక్టర్. బైరెడ్డి శబరి..
సిరా న్యూస్,నంద్యాల;
వాల్మీకుల హక్కుల కోసం
టీడీపీ అండగా ఉంటుందని, వాల్మీకి రామాయణంలో శబరి పాత్ర చాలా గొప్పదని నంద్యాల టీడీపీ ఎం.పీ. అభ్యర్థి డాక్టర్. బైరెడ్డి శబరి అన్నారు.శనివారం నంద్యాల జయంత్ వెజ్ వరల్డ్ ఫంక్షన్ హల్ లో నంద్యాల నియోజకవర్గం వాల్మీకుల ఆత్మీయ సమావేశం గోవిందనాయుడు అధ్యక్ష్యతన జరిగింది.
ఈ సందర్బంగా ఎం.పీ. అభ్యర్థి డాక్టర్ . బైరెడ్డి శబరి మాట్లాడుతూ వాల్మీకుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ వంతు కృషి చేస్తామని, వాల్మీకి రచించిన రామాయణం ప్రపంచానికే ఆదర్శ నీయంగా ఉందని, వాల్మీకుల రిజర్వేషన్ కోసం తాను పనిచేసి ఆనాటి శబరి పాత్రలా తాను కూడా వాల్మీకులకు పనిచేస్తానని అన్నారు. నంద్యాల ఎం.పీ. తనను, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాల్మీకులను ST జాబితాలో చేర్చి న్యాయం చేసేందుకు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు నివేదించారని, తాను ఎం.పీ . గా గెలినవెంటనే వాల్మీకుల రిజర్వేషన్ కోసం లోక్ సభలో గలమెత్తుతానన్నారు.నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్. ఎం.డి. ఫరూక్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ ఏ వి. సుబ్భారెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు, సీనియర్ న్యాయవాదులు రామచంధ్రారావు, తాతిరెడ్డి తులసి రెడ్డిలు మాట్లాడుతూ రాబోయేది రాష్ట్రంలో టీడీపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అన్నారు. వైసీపీ జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అనేక బాధలు పడ్డారని, వారికీ రెండు వారాల్లో విముక్తి కలుగుతుందన్నారు. రాష్ట్రానికి జగన్ ఏమి ఉద్దరించారని మళ్ళీ ఓటు వేయాలని వారు ప్రశ్నించారు. వాల్మీకులకు టీడీపీ అండగా ఉంటుందని, వాల్మీకులు టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు బోయ రామకృష్ణ, ప్రముఖ కాంట్రాక్టర్ మహేష్ నాయుడు, పి వి రమణ, కాశన్న, ధనుంజయుడు, చందు తదితరులు పాల్గొని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ . బైరెడ్డి శబరి, నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎన్. ఎం.డి. ఫరూక్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.