Rajarshi Shah: పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి:  జిల్లా ఎన్నికల అధికారి 

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి:  జిల్లా ఎన్నికల అధికారి 
* బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ పరిశీల‌న‌

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను కలెక్టర్ ఎస్పీతో కలిసి శనివారం పరిశీలించారు. పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఓటింగ్ సరళి గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, సాఫీగా జరిగేలా చూడాలని, ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఓటరు హెల్ప్ లైన్ కౌంటర్ వద్దనే ఓటరు జాబితాలోని క్రమ సంఖ్య, పార్ట్ నెంబర్ ను చెక్ చేసుకోవాలని అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు ఈ నెల 8 వరకు నిర్వహించు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏపీఓ , ఓపీఓ , పీఓలకు వేరు వేరుగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *