Madawar Harish Reddy: ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో ప‌రీక్షా కేంద్రం ఏర్పాటు

సిరాన్యూస్‌,బేల‌
ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో ప‌రీక్షా కేంద్రం ఏర్పాటు
* ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి

బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప‌రీక్ష కేంద్రం ఏర్పాటు అయింద‌ని ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మాడవార్ హరీష్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.గత పాలకులు అధికారుల నిర్లక్ష్యం వల్ల డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఆదిలాబాద్ కు తరలించడం జరిగింద‌న్నారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ దృష్టికి తీసుకు వెళ్లామ‌న్నారు. వెంట‌నే స్పందించిన‌ ఎమ్మెల్యే యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి పరీక్ష కేంద్రాన్ని బేల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయించారని తెలిపారు. 400కు పై గిరిజన ఆదివాసి మండల విద్యార్థులకు మేలు జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులు, గ్రామస్తులు తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో శివానీత్ వార్ ఓం ప్రకాష్, పోత్ రాజ్ శ్రీకాంత్, పాయల్ సాయి వంశీ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *