సిరాన్యూస్, ఖానాపూర్
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన ఉప్ప నవీన్ గత నెలలో బహ్రెయిన్ దేశానికి ఉపాధి కూలీగా పనికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారి ఇంటికి వెళ్లి నవీన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆర్థిక సహాయంగా 10000 రూపాయలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం , వైస్ చైర్మన్ కావలి సంతోష్ , మండల అధ్యక్షులు దోనికేని దయానంద్, జనరల్ సెక్రెటరీ షబ్బీర్ పాషా, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, నాయకులు తోట సత్యం,నేరేళ్ల సత్యనారాయణ గొర్రె గంగాధర్, జహిర్ ఖాన్, మదిరే సత్యనారయణ, శేషాద్రి, రాజేందర్, షౌకత్ పాషా,సతీష్ రెడ్డి, రమేష్ శ్రీనివాస్, తది తరులు పాల్గొన్నారు.