Chiluveru Srikanth:భారత రాజ్యాంగాన్ని రక్షించే ధర్మ సమాజ్ పార్టీని ఆదరించండి

సిరాన్యూస్‌, చిగురుమామిడి
భారత రాజ్యాంగాన్ని రక్షించే ధర్మ సమాజ్ పార్టీని ఆదరించండి
* ధర్మసమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్

భారత రాజ్యాంగాన్ని రక్షించే ధర్మసమాజ్ పార్టీని ఆదరించాలని ధర్మసమాజ్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి చిలువేరు శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కుట్రలో భాగస్వాములుగా పనిచేస్తున్నాయని అన్నారు.70 ఏళ్లుగా భరత భారత పార్లమెంటరీ విధానానికి వ్యతిరేకంగా 10 శాతం లేని అగ్రకులాలే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారని విమర్శించారు.మహాత్మ జ్యోతిరావు ఫూలే అంబేడ్కర్ కాన్షిరాముల ఉద్యమానికి కొనసాగింపుగా ధర్మసమాజ్ పార్టీ తెలంగాణ గడ్డమీద ఆవిర్భవించిందని తెలిపారు.90 శాతం బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకుల పేదల రాజ్యాన్ని తెలంగాణ గడ్డమీద స్థాపించడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రక్షించే ఏకైక పార్టీ ధర్మసమాజ్ పార్టీ అని పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గుర్తు అయిన చెప్పుల గుర్తుకు ఓటు వేయాలని ప్రజల్ని కోరారు.10 శాతం లేని అగ్రకుల పార్టీలకు ఓటు వేస్తే రాజ్యాంగాన్ని అంతం చేస్తాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా కోశాధికారి బాబు, జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్, సురేష్, శివాజీ, అశోక్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *