Raut Ravinder: సుసంస్కార్ శిబిరాల్లో పాల్గొన్న 19 మంది బాల‌లు: జిల్లా అధ్యక్షులు రావుత్ రవీందర్

సిరాన్యూస్‌,బేల‌
సుసంస్కార్ శిబిరాల్లో పాల్గొన్న 19 మంది బాల‌లు: జిల్లా అధ్యక్షులు రావుత్ రవీందర్

వందనీయ రాష్ట్ర సంత శ్రీ తుకడోజీ మహరాజ్ సంస్థాన్ గురుకుంజ ,మొజ్రీ ,బాల సుసంస్కార శిబిరం అధ్యక్షులు రవి దాదా మానవ్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన సుసంస్కార్ శిబిరాల్లో బేల మండ‌లంలోని 19 మంది బాల‌లు పాల్గొ్న్న‌ట్లు సుసంస్కార్ శిబిర్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రావుత్ రవిందర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని డోప్టాల, సిర్సన్న , ఆవాల్ పూర్ , భాది, సొన్ ఖాస్ గ్రామాల నుండి 19 మంది బాలలు శిక్షణ కోసం వెళ్ళడం జరిగింద‌ని తెలిపారు. బాలలు నేర్చుకున్న విషయాలను అభినందించారు. ఈ శిబిరం లో విద్యార్థులకు సంస్కారం, జీవనైపుణ్యాలు, యోగ , ధ్యానం, సాముదాయిక ప్రార్థన ,గ్రామ గీత అధ్యయనం,సంగీత వాయిద్యాల శిక్షణ,దేశ భక్తి, నాయకత్వ లక్షణాలు, కరాటే,ఉపన్యసించడం, నీతి కథలు లాంటి అనేక కళలు నేర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభ‌మై 15వ తేదీ వరకు జ‌రుగుతాయ‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *