సిరా న్యూస్, ఖానాపూర్
సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలి
పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో సోమవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయాన్నే ఉపాధి కూలీలు పని చేసే ప్రాంతానికి వెళ్లి వారికి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను వివరించారు. అదేవిధంగా తమ పార్టీ గెలిస్తే జరగబోయే అభివృద్ధి పనుల గురించి ఉపాధి కూలీలకు వివరించారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్, కార్యకర్తలు పాల్గొన్నారు.