ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం

ముగ్గురు అధికారులకు షోకాజ్ నోటీసులు

 సిరా న్యూస్,శ్రీకాకుళం;
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా ముగ్గురు ఉన్నతాధికారులపై చర్యలకు ఉపక్రమిస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.మనజీర్ జిలాని సమూన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నరసన్నపేటలో శనివారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియలో గందరగోళ పరిస్థితులకు తావిచ్చిన కారణంగా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు, 24 గంటల్లో నోటీసులపై స్పందించి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నరసన్నపేట రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు, మెప్మా పీడీ, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలియేషన్ సెంటర్ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సారవకోట తహసిల్దార్ భాగ్యలక్ష్మిలు షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *