Surendra Babu: నీళ్లు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేస్తాం: ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు

సిరా న్యూస్, కుందుర్పి
నీళ్లు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేస్తాం: ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
మందలపల్లిలో ఎన్నికల  రోడ్ షో

నీళ్లు తీసుకొచ్చి ప్రజలకు మంచి చేస్తామ‌ని కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. సోమ‌వారం అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మందలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారనికి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆయ‌న మాట్లాడుతూ  గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అందుకు ఈనెల‌13న ప్రతి ఒక్క‌రూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, కుందుర్పి మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *