సిరా న్యూస్,చిత్తూరు;
చిత్తూరు జిల్లా కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించింది. సోమవారం ఉదయం ప్రారంభమయిన సోదాలు సాయంత్రం వరకు కొనసాగాయి. ల్యాండ్ కన్వర్షన్ కు రూ.25000 లంచం తీసుకుంటూ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డట్లు సమాచారం. ఏసీబీ డి.ఎస్.పి జస్సి ప్రశాంతి రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్నారు