సిరా న్యూస్,ఖానాపూర్
గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలి : అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్
* విద్యానగర్లో కార్నర్ మీటింగ్
బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని ఖానాపూర్ అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోనీ విద్యానగర్ లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా 231, 232, 233, 234 బూతులలో బీజేపీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ చేపట్టి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాయిని సంతోష్ , మాజీ సర్పంచ్ అకుల శ్రీనివాస్, డి మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కొండవేని రమేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు బొప్పరపు సత్యవతి , పరమేశ్వర్ గౌడ్,మేకల నర్సయ్య, బొప్పారపు రాజు, దానిపల్లి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.