సిరాన్యూస్, జైపూర్
మంతెన రవితేజకు ఘన సన్మానం
హైదరాబాద్ కేంద్రంగా శ్రీశ్రీ కళావేదిక , కర్ణాటక సాహిత్య మందిర్ ఆధ్వర్యంలో సోమవారం శతాధిక ద్విభాష కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కవి సమ్మేళనానికి జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన మంతెన రవితేజ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంతెన రవితేజ “గట్టోడ మెట్టోడ గావురాల మల్లు” అనే కవితా శీర్షిక తో తన కవిత్వన్ని వినిపించారు. అనంతరం సాహితీ సంస్థల వారు మంతెన రవితేజను శాలువ, ప్రశంస పత్రం తో సత్కరించారు . కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్, భహుభాషా కవయిత్రి జోష్యుల ప్రభశాస్త్రి , కన్నడ తెలుగు కవులు, సాహీతీ వేత్తలు పాల్గొన్నారు.