Bairi Raju: వెలిచాల రాజేందర్ రావు ను అధిక మెజార్టీతో గెలిపించాలి

సిరా న్యూస్, సైదాపూర్
వెలిచాల రాజేందర్ రావు ను అధిక మెజార్టీతో గెలిపించాలి
* మాజీ ఎంపీటీసీ బైరి రాజు
* లస్మనపల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల విస్తృత ప్రచారం

కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీటీసీ బైరి రాజు అన్నారు. మంగ‌ళ‌వారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంత సుధాకర్ సూచన మేరకు గ్రామశాఖ అధ్యక్షుడు జాల రాజు, గ్రామ మాజీ ఎంపీటీసీ బైరి రాజు ఆధ్వర్యంలో లస్మన్నపల్లి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ శ్రేణుల విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన ప్రజాపాలన, పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు కరెంట్‌, అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు వేసి మద్దతు తెలుపాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ పెసరు తిరుపతి, కనకం తిరుపతి, గుర్రాల మహేందర్ రెడ్డి, డోనపాటి చంద్రారెడ్డి, దాసరి సందీప్, కుట్ల రవి, దాసరి మల్లయ్య, పాల్సాని అనిల్ రెడ్డి,మ్యాకల రవీందర్ రెడ్డి, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *