సిరా న్యూస్, ఆదిలాబాద్
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా
* విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్
* ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో సైన్స్ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. సమాజంలో పెరుగుతున్న మూఢనమ్మకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, శాస్త్రీయ వైఖరి ద్వారానే మూఢనమ్మకాల నుంచి బయటపడచ్చని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని ప్రశ్నించి స్వీకరించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సైన్స్ సమ్మర్ క్యాంప్ లో విద్యార్థుల యొక్క ప్రదర్శనను తిలకించారు. సమాజంలో మూఢనమ్మకాలను నిరోధించడంలో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడంలో జన విజ్ఞాన వేదిక చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, సెక్యులర్ అధికారి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ కుమార్ భేదోడకర్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.