సిరా న్యూస్, నేరడిగొండ
బీజేపీతోనే సమన్యాయం సాధ్యం : ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గట్టు నారాయణ
గ్రామాల్లో బీజేపీ నాయకుల ఇంటింటా ప్రచారం
బీజేపీతోనే అందరికి సమన్యాయం దొరుకుతుందని బీజేపీ జిల్లా ఓబిసి మోర్చా ఉపాధ్యక్షుడు గట్టు నారాయణ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని యాపల్ గూడ, ఇస్రుగూడ, బోరిగాం, సేవదాస్ నగర్,ఏసుగూడ గ్రామాలలో ఇంటింటికి వెళ్లి బీజేపీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి సమన్యాయం చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. బీజేపీ అంత్యోదయ లక్ష్యంతో పని చేసి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న ప్రతీ పేదవారిని పేదరికం నుండి బయటకు తీయడానికి ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని అన్నారు. మరింత వేగంతో అభివృధ్ది చెందాలంటే బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, ఎంపీటీసీ కృష్ణ, పిఎసిఎస్ డైరెక్టర్ రవిందర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ దుర్వ రాజు, మాజీ సర్పంచ్ కోటేష్, మహేందర్ రెడ్డి, అడెపు నరేందర్, వెంకటేష్, రాజేందర్ రెడ్డి, గంగారాం, పృథ్వీరాజ్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు