ఏలూరు జిల్లాలో పోస్టల్ బ్యాలట్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం

సిరా న్యూస్,ఏలూరు;
జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు ఏలూరు జిల్లాలో పోస్టల్ బ్యాలట్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యిందని జిల్లా మీడియా సమన్వయకర్త మరియు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. రిటర్నింగ్ అధికారులు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులు తమ ఓటుహక్కు సజావుగా ఉపయోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారన్నారు. పోలింగ్ సజావుగా జరగడానికి ప్రత్యేక కౌంటర్లు, టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసారని, అలాగే హెల్ప్ డెస్కులు, త్రాగునీరు, మినీ వైద్య శిభిరాలు, చలువ పందిళ్ళు ఏర్పాటు చేసారని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవడానికి వస్తున్నా ఉద్యోగులకు సమాచారం అందించడానికి, సహకరించడానికి పోలింగ్ కేంద్రాల వద్ద లైజన్ అధికారులను ఏర్పాటు చేసారన్నారు. తక్షణ సమాచారం కోసం తనను 9849903321 ఫోన్ నెంబరుఫై సంప్రదించ వచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *