అద్దంకి దయాకర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్
సిరా న్యూస్,జగిత్యాల;
లౌకికవాదం ముసుగులో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎవరైనా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ దేవి దేవతలను దూషిస్తే ఊరుకునేది లేదని
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్ హెచ్చరించారు.మంగళవారం జిల్లాలోని పెగడపెల్లి మండల కేంద్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయిలో బీజేపీకి పెరుగుతున్న ఆధరణను చూసి జీర్ణించుకోలేక హిందూ సమాజాన్ని విడదీయడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి మైనార్టీ ప్రజల సంతుస్టీకరణ కోసం అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కాకముందే అయోధ్య రాముని అక్షింతలు అని రేషన్ బియ్యానికి పసుపు రాసి గ్రామాల్లో పంచారని బహిరంగ వేదికల ద్వారా విమర్శించడం ముఖ్య మంత్రికి హిందువుల పట్ల ఉన్న దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. కొమురం భీం జిల్లాలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకిస్తాన్ ప్రేమికుడు రోహింగ్యాల నాయకుడు అద్దంకి దయాకర్ బిజెపి వాళ్లు మేము హిందువులం హిందువులం అంటున్నారు శ్రీరాముడు మీకేమైనా చిన్నయ్య అవుతాడా సీతమ్మ మీకేమైనా చిన్నమ్మ అవుతుందా మీరేమైనా రాముని వంశంలో పుట్టారా అంటూ చేసిన వ్యాఖ్యలు దేశములోని కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని అడ్డం దిడ్డం మాట్లాడిన అద్దంకి దయాకర్ హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పలు వేదికలపై అద్దంకి దయాకర్ జై సోనియమ్మ అంటూ సంభోదిస్తాడు మరి అలాంటప్పుడు సోనియాగాంధీ దయాకర్ కు ఏమైనా అమ్మ అవుతుందా లేదా రాజీవ్ గాంధీ తండ్రి అవుతాడా స్పష్టం చేయాలని ప్రశ్నించారు.సాక్షాత్తు ఒక ప్రధానమంత్రి వ్యక్తిగత జీవితం మీద మాట్లాడిన దయాకర్ అదే సోనియాగాంధీ వ్యక్తిగత జీవితం మీద వివాహానికంటే ముందు ఒక క్లబ్ డ్యాన్సర్ అని ఎందుకు మాట్లాడడం లేదన్నారు. మోడీ అమిత్ షా లను ఏక వచనంతో సంబోధిస్తూ రారా పోరా అని మాట్లాడడం చూస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతుందని అభద్రత భావంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మతప్రాతిపదికన దేశాన్ని మూడు ముక్కలు చేసి ముస్లింల కోసం ప్రత్యేక దేశం ఇచ్చి ఇవాళ ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏ పార్టీ మతతత్వ పార్టీయో ప్రజలకు అర్థమవుతుందని అన్నారు. దేశాన్ని ముక్కలు చేయాలి ఆజాది కావాలంటూ నినదించి ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ పేరుమీద చట్టం చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ 370 ఆర్టికల్ పునరుద్ధరిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరోసారి దేశ విభజనకు బీజం వేసినట్లు అవుతుందని అందుకే కాంగ్రెస్ భారత్ కోసం బిజెపి ఓటేయాలని కోరారు.దేశాన్ని ముక్కలు చేయాలన్న కన్నయ్య కుమార్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే దేశాద్రోహులకు శిక్షలు పడేలా చేసిన ఉజ్వల్ నిఖం కు బీజేపీ టికెట్ కేటాయించిందని అందుకే దేశ ద్రోహులకు దేశభక్తులకు మధ్య జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో దేశభక్తుల పార్టీ బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు…ఈ సమావేశంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు పల్లె మోహన్ రెడ్డి, పెంట నరేందర్, నాయకులు మంద భీమయ్య, నలువాలా కరుణాకర్ రెడ్డి, పబ్బతి అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..