సిరాన్యూస్, చిగురుమామిడి
పార్టీ అభివృద్ది కోసం పని చేయాలి : మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి స్వాగతం పలికిన నాయకులు
కాంగ్రెస్ పార్టీ విధివిధానాల కట్టుబడి పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని కాంగ్రెస్ చిగురుమామిడి మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి అన్నారు.రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల బీఆర్ఎస్ పార్టీ నుండి పలువురు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా మంగళవారం చిగురుమామిడి మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి స్థానిక రాహుల్ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీలో చేరిన పలువురికి స్వాగతం తెలిపారు. అనంతరం కంది తిరుపతిరెడ్డి, జెడ్పిటిసి గీకురు రవీందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విధివిధానాల కట్టుబడి పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని తెలిపారు.పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం పనిచేస్తామని నాయకులు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో రేకొండ మాజీ సర్పంచ్ పిట్టల రజిత, నవ బ్ పేట సర్పంచ్ సుద్దాల ప్రవీణ్, పెన్యాల శ్యామ్ సుందర్ రావు, చిట్టి మల్ల శ్రీనివాస్ మాజీ సింగిల్ విండో చైర్మన్, ముప్పిడి దేవేందర్ రెడ్డి ఎంపీటీసీ, తెలంగాణ ఫిషరీ సొసైటీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కూనచుల మహేందర్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి అరుణ, కంది వేణు, మేకల రాజేందర్, చాడ వేణుమాధవ్ రెడ్డి పలువురు కార్యకర్తలు ఉన్నారు.