సిరా న్యూస్, సైదాపూర్
రూ. 1,28,000 నగదు పట్టివేత
ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అప్పగింత
ఎలాంటి ఆధారాలు లేని రూ.1,28,000 నగదు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఆరోగ్యం తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలబోతారం గ్రామంలో సోమవారం సాయంత్రం హుజరాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ గౌడ్, ఎస్సై జన్ను ఆరోగ్యం ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి హుజురాబాద్ నుండి బొలెరో వాహనంలో బెజ్జంకి వెళ్తున్నారు. ఈక్రమంలో పోలీసులు బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. శ్రీనివాస్ రెడ్డి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేని ఒక లక్ష 28వేల నగదును పట్టుకున్నారు. అనంతరం నగదును సీజ్ చేసి (ఎఫ్.ఎస్.టీ) ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సభ్యులకు అందించినట్లు తెలిపారు.