సిరా న్యూస్, భీమదేవరపల్లి
వెలిశాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలి
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పచ్చునూరి కరుణాకర్
* భీమదేవరపల్లిలో ఇంటింటా ప్రచారం
కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని వెలిశాల రాజేందర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పచ్చునూరి కరుణాకర్ అన్నారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలోని మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పచ్చునూరి కరుణాకర్ మాట్లాడారు.ప్రతి ఒక్కరు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి వెలిశాల రాజేంద్ర రావు భారీ మెజర్ తో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రజలు చేసింది ఏమీ లేదన్నారు.హుస్నాబాద్, హుజురాబాద్, మానకొండూర్,చొప్పదండి వేములవాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ రానుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు లక్ష మెజార్టీతో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్పాటి శ్రీనివాస్ రెడ్డి , చాగంటి వెంకటేశ్వర్లు, ఎలకపల్లి ఆనందం, సాతులు మొగిలి, సింహాద్రి శ్రీనివాస్, ముడిదొడ్డి కుమారస్వామి, లింగం కృష్ణ, తదితరులు పాల్గొన్నారు