సిరా న్యూస్, బేల
బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ విజయం ఖాయం : మండల అధ్యక్షుడు దత్తా నిక్కం
బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్ధి గోడం నగేష్ విజయం ఖాయమని బీజేపీ మండల అధ్యక్షుడు దత్తా నిక్కం ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పోనాల,దేవుజిగూడ, రంకం గ్రామాలలో బిజెపి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని తప్పకుండా మోడీ చరిష్మా తోటి గోడం నాగేష్ రెండు లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుస్తారన్నారు. ప్రజలతో మమేకమైన బిజెపి మండల అధ్యక్షుడు దత్తా నిక్కం ప్రతి ఇల్లు తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని, రానున్న రోజుల్లో బిజెపి ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ గెలుపు తోటి మనకున్న సమస్యలన్నీ తీర్చే విధంగా ఆ దిశగా కృషి చేస్తానని తెలియజేశారు.ఈ ప్రచారంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్ ఠాక్రే,మాజీ సర్పంచులు రాకేష్, ఇంద్రశేఖర్, తేజ్ రావు,గణేష్, దర్నె జీవన్, మోరేశ్వర్, రాము బర్కాడే,నారాయణ, తదితరులు పాల్గొన్నారు.