సిరాన్యూస్, గుడిహత్నూర్
ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: ప్రముఖ న్యాయవాది అజయ్ కుమార్ జొండలే
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దామని ప్రముఖ న్యాయవాది అజయ్ కుమార్ జొండలే అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రముఖ న్యాయవాది అజయ్ కుమార్ జొండలే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ గ్యారెంటీలను సవివరంగా తెలియజేశారు. గత 10 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏ మేలు చేయలేదని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తోడ్పడుతుందని తెలియజేశారు. కేవలం కుల, మత వర్గ ప్రాతిపదికన రాజకీయం చేయడం సరికాదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల కరుణాకర్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆడే షీలా, మాజీ జడ్పీటీసీ మస్కే మాధవ్, అంకత్ రవి, నాగ్నాథ్ అప్పా, మాధవ్ ససానే, దళిత్ గాయ్ కాంబ్ల్, తరుణ్ గిట్టే కార్యకర్తలు , నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.