సిరాన్యూస్, చిగురుమామిడి
బీజేపీ, బీఆర్ఎస్లను ఓడిద్దాం.. దేశాన్ని రక్షించుకుందాం
* హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ మేకల వీరన్న యాదవ్
దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, బీజేపీ, బీఆర్ఎస్లను ఓడిద్దామని, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ మేకల వీరన్న యాదవ్ అన్నారు. బుధవారం చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో హుస్నాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.వారు మాట్లాడుతూ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని అన్నారు. దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బడా కార్పొరేటర్లకు, సంపన్న వర్గాలకు, దోపిడి దారులకు కొమ్ము కాస్తుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు.దేశంలో పేద వర్గాలకు ప్రాణం పోసిన భారత రాజ్యాంగం పెను ప్రమాదంలో ఉందని, రాజ్యాంగాన్ని రక్షించాలంటే కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని తెలిపారు. రేకొండ, గాగిరెడ్డిపల్లి, సుందరగిరి వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఫ్రాన్సిస్, తొందూరు ఎల్లయ్య, ఎల్లయ్య, గంపల శ్రీనివాస్, నోముల బాలయ్య, మాటేడు శ్రీనివాస్, జక్కుల రమేష్, ఇల్లందుల లక్ష్మణ్ గౌడ్, రాగి శ్రీనివాస్, మంద పరశురాములు తదితరులు పాల్గొన్నారు.