సిరా న్యూస్,విజయవాడ;
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. దోనబండ క్వారీలో ఉన్న నీటి గుంతలో పడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఒడిశాకు చెందిన అక్కాచెల్లెళ్లు క్వారీ వద్ద బట్టలు ఉతుకుతుండగా వారిలో ఒకరు కాలు జారి పడిపోయారు. ఆమెను కాపాడబోయి మరో మహిళ గుంతలో పడిపోయింది. ఆపై ఊపిరాడక వారిద్దరూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు.