బీజేపీ నాయకులపై పోలీసుల దౌర్జన్యం
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
సిరా న్యూస్,జూబ్లీహిల్స్;
ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలపై బోరబండ పోలీసులు దాడి చేశారని బోరబండ బీజేపీ నాయకుడు కొత్త వెంకటేశ్ ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బోరబండ డివిజన్లోని పెద్దమ్మ నగర్లో మంగళవారం బీజేపీ కార్యకర్తలు ప్రచారం నిర్వ హిస్తున్నారు. వారిలో కొంతమందిని బోరబండ పోలీసులు పోలీసులు స్టేషనక్కు తీసుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న బీజేపీ బోరబండ డివిజన్ ప్రెసిడెంట్ కొత్త వెంకటేశ్తో పాటు ముఖ్య నా యకులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అప్పటికే పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తున్న డీసీపీ విజయ్ కుమార్ బీజేపీ నాయకులను దుర్భాషలా డుతూ బయటకు నెట్టేయండి అని డీఏ భూపా ల్గౌడ్ను ఆదేశించడంతో వెంకటేశ్ కాలర్ ప ట్టుకుని బయటకు నెట్టాడు. ఈ నేపథ్యంలో వెం కటేశకు గాయాలు అయ్యాయి. చికిత్స అనంత రం ఇరువురిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉ న్నతాధికారులకు బోరబండ పోలీస్ స్టేషన్లో ఫి ర్యాదు చేశాడు. దీనిపై కిషన్రెడ్డి స్పందించి ఈసీ కి ఫిర్యాదు చెయ్యమని తెలిపినట్లు వెంకటేష్ తెలిపారు.