PremSagar Reddy: గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి: మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి

సిరాన్యూస్, ఓదెల
గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి: మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి
* ఓదెల మండ‌లంలో కాంగ్రెస్ నాయ‌కుల విస్తృత ప్ర‌చారం

కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి అన్నారు. బుధ‌వారం ఓదెల మండలం లంబాడీతండా గ్రామంలోని ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాల‌ని కోరారు. కాంగ్రెస్ తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఏ ఒక్క పేదవాడికి రేషన్ కార్డులు ,డబుల్ బెడ్ రూములు ఇచ్చిన దాఖలు లేవని అన్నారు.ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ రావాలని ఓదెల మండల కాంగ్రెస్ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి అన్నారు. ఈ ప్రచారంలో నూతనంగా ఎన్నికైన పో త్క పల్లి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ళ సుమన్ రెడ్డి, నిమ్మ నాయక్, కాంగ్రెస్ నాయకులు, తండా మహిళలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *