సిరా న్యూస్,హైదరాబాద్;
సనాతన హిందూ దర్మ పరిరక్షణ కు కట్టుబడే వ్యక్తులు, పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని కమలనందా స్వామిజీ.గాయత్రి పీఠం శ్రీకాంతా నంద స్వామిజీ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ వానర సేన ఆధ్వర్యంలో సైదాబాస్ వినయ్ నగర్ లోని శ్రీ విజయ వినాయక ఆలయం హాల్ సమావేశం నిర్వహించారు. నేతలు దేవాలయ భూములు కబ్జా చేసి తమ లబ్ది కోసం పార్టీలు మారుతూ పదవులు వెలగ పెడుతున్నారని ఆరోపించారు. హిందు సమాజం ఐక్యంగా కావాల్సిన అవసరముందని చెప్పారు.
ఓటు ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రం లాంటిదని అంటూ ఓట్ చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటని నిర్ణక్ష్యం వహిస్తే భవిష్యత్తులో దేశం విషయంలోనే కాక తమ ఇంట్లోని వారి పరిస్థితిలు తారుమారయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. అంతే గాకుండా ఇటీవల కాలంలో హింధూ సనాతన ధర్మంపై దాడులు జరిపే పార్టీలు, నాయకులు ఎక్కువైనా హిందూ ఓటర్లు పట్టించుకోకుండా వదిలేస్తే రేపు మన మనుగడకు కడ్తమవుతుని చెప్పారు. హిందూ సనాతన ధర్మంపై పలు కోణాల నుంచి దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ వాటిని తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉందని సద్గురు తెలిపారు. భాగ్యనగరంలో ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన భాద్యతను ప్రతి హైందవ బంధూ గుర్తెరిగి పరిరక్షించకపోతే రేపు తమ తమ సురక్షతను కోల్పోయిన వారవుతారని హెచ్చరించారు. దేశం కోసం ధర్మం కోసం కృషి చేస్తున్న పార్టీలకు ఓటు వేయాలని కోరారు.