సిరాన్యూస్, బేల
బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓట్లతో బుద్ది చెప్పండి : సీపీఎం జిల్లా నాయకులు లంక రాఘవులు
* డోప్టాలాలో సీపీఎం పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం
బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓట్లతో బుద్ది చెప్పాలని సీపీఎం జిల్లా నాయకులు లంక రాఘవులు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని డోప్టాలా గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన క్యాంపెయిన్ చేపట్టారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ గ్యారంటీ కరపత్రాలను పంచుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా నాయకులు లంక రాఘవులు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు. గత పది సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని పేర్కొన్నారు. పదేళ్ళ బీజేపీ పాలనలో ప్రజల కోసం చేసిందేమీ లేదని పదేళ్ళ పాలనలో బీజేపీ ధరలు పెంచడం తప్ప ఏమీ చేయలేదు అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారం మోపింది అని అన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణ మాఫీ చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ,బిఆర్ఎస్ లను ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. ఆత్రం సుగుణక్క కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మండల కార్యదర్శి స్వామి, ఆశన్న, నడుకుంటి ప్రభాకర్, శకుంతల,పోసాని, రేణుక, మల్లేష్, రాజమ్మ, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.