సిరాన్యూస్, సైదాపూర్
మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో పలువురు చేరిక
సైదాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీ కార్యకర్తలు భారీగా వలసలుగా వచ్చి చేరుతున్నారు. సైదాపూర్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన కనుగంటి బిక్షపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యాల మల్లేష్ లు వెన్నంపల్లి పిఎసిఎస్ మాజీ చైర్మన్ చైర్మన్ సారబుడ్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వాళ్ళు తెలిపారు.