కర్నూలును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాను –

ఏ.ఎండి. ఇంతియాజ్.

 సిరా న్యూస్,కర్నూల్;
నగరంలోని స్థానిక ఎన్.ఆర్. పేట నందు చాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ లో ఏర్పాటుచేసిన వైఎస్ఆర్సిపి న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఏ.ఎండి. ఇంతియాజ్ ఐఏఎస్ (రిటైర్డ్), కర్నూల్ పార్లమెంట్ వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి బి.వై. రామయ్య, కోడుమూరు నియోజవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమలుపు సతీష్, కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎండి. ఇంతియాజ్ మాట్లాడుతూ కర్నూల్ లో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాను, అలాగే సమాజంలో న్యాయవాదుల కోసం జగనన్న ఎంతో చేశారని అన్నారు, కర్నూలుకు లోకాయుక్త మరియు నేషనల్ యూనివర్సిటీ కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారని. కావున మన కర్నూలును అభివృద్ధి చేసుకోవాలి అంటే కచ్చితంగా ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పుల్లారెడ్డి, సువర్ణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *