సిరాన్యూస్, బోథ్
అభివృద్ధి పనులు చూసి బీజేపీకి ఓటు వేయండి: ఎంపీటీసీ గోడం జగదీరావు
మోడీ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి బీజేపీకి ఓటు వేయాలని ఎంపీటీసీ గోడం జగదీరావు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ,తదితర గ్రామాలలో బీజేపీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ను గెలిపించాలని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కోడప విజయ్, పెందుర్తి, మాజీ సర్పంచ్ సోయం విశ్వనాథ్, మాజీ సర్పంచ్ తొడసం భీమ్రావు, మాజీ సర్పంచ్ మెస్రం జయవంతరావు, పెందుర్ గోవిందరావు, మండాడి వెంకట్రావు, పెందుర్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు.