సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
ఆత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుందాం : కౌన్సిలర్ కావలి సంతోష్
కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపిద్దామని కౌన్సిలర్ కావలి సంతోష్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోనీ బుధవారం ఒకటో వార్డులో కౌన్సిలర్ కావలి సంతోష్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి రాజేందర్, శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.