సిరాన్యూస్, ఖానాపూర్
అడ్వకేట్ వెంకట్ మహేంద్ర ను పరామర్శించిన ఉద్యోగ సంఘాల నేతలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఇటీవల శివాజీ నగర్ కు చెందిన అడ్వకేట్ వెంకట్ మహేంద్ర పై ఖానాపూర్ కి చెందిన యువకులు చేసిన దాడిని పలు ఉద్యోగ సంఘ నేతలు ఖండించారు. ఈ మేరకు బుధవారం వెంకట్ మహేంద్రను పరామర్శించి మాట్లాడారు. ఈ చర్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో లక్ష్మీనరసయ్య, దశరథ్, రాజు, కృష్ణ, మోహన్, మహేశ్వర్, రాజేందర్, శ్రీనివాస్, శ్రీకాంత్, రాజేశ్వర్, మురళి, తదితరులు పాల్గొన్నారు.