బోత్సకు కౌంటర్ ఇచ్చిన పురందేశ్వరి

సిరా న్యూస్,విజయవాడ;
మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఘాటు కౌంటర్ ఇచ్చారు. బొత్స సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యల పై మండి పడ్డారు. పచ్చకామెర్ల వారికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంద న్నట్లు ఘాటు వ్యాఖ్య చేసరు. అవినీతి చేసే వారికి అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంది. బొత్స చేసిన వోక్స్ వాగన్ స్కాం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. విశాఖ రైల్వే జోన్ కు రాష్ట్రం ఇచ్చిన భూమి అనువుగా లేదు. వంద కోట్ల పైగా కేంద్రం రైల్వేజోన్ కు ఇస్తుంటే ఎందుకు అందిపుచ్చుకో లేకపోయారు. పసలేని ఆరోపణలు చేయడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించుకోవాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *