దౌల్తాబాద్ లో నీలంమధు ప్రచారం

సిరా న్యూస్,మక్తల్;
తాను ఎంపిగా గెలిచిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తానని, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు కాంగ్రెస్ మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు. సిద్దిపేట జిల్లా రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరితో కలిసి రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడారు. రైతుల కన్నీళ్ళకు కారకుడైన వ్యక్తి కావాలో.. ప్రజల కోసమే సేవ చేస్తున్న వ్యక్తి కావాలో? ఒక్కసారి ఆలోచన చేయాలని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు అన్నారు.
గరీబోళ్ల సంక్షేమం కోసం కాంగ్రెస్ నిలబడుతుందన్నారు. బిజెపి మాత్రం ఆదాని అంబానీల కోసం పనిచేస్తోందన్నారు. మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తే ధరలు మరింతగా పెరిగిపోతాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలలో తనను గెలిపించండి.. మెదక్ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని ఎంపీ అభ్యర్థి నీలం మధు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *