ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలో బిజీ బిజీగా వైసిపి..

సిరా న్యూస్,కావలి;
నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యదేచ్చగా ముందుకు సాగుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం సచివాలయాన్నె మద్యం స్టాక్ పాయింట్ గా పెట్టిన వైసీపీ నేడు క్రికెట్ కిట్లను సరఫరా చేస్తుంది. బోగోలు మండలం ఏనుగుల బావి గిరిజన కాలనీ మరియు పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లో క్రికెట్ కిట్లను రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున ఎన్నికల నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్న అధికార యంత్రాంగం నిమ్మక్క నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. నాడు సచివాలయంలో మద్యం నేడు యదేచ్చగా క్రికెట్ కిట్ల పంపిణీ చూస్తుంటే ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న చెక్ పోస్టులు స్పెషల్ స్క్వార్డులు నిద్రమత్తులో జోగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *