సిరా న్యూస్, జైనథ్:
కామాయిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం…
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కామాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మండల ఎన్నికల ఇన్చార్జి భూమారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేందర్ రెడ్డిలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఐదు న్యాయాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రజలు బి, బిజెపిలను నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరు చేయి గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగుణక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.